భూమి హక్కుల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో పేరుంటే హక్కులు రావని తేల్చి చెప్పింది. పహాణీలు, రెవెన్యూ ఎంట్రీలు కేవలం పన్నులు, పంటల వివరాల కోసమేనని స్పష్టం చేసింది. భూమిపై అసలైన హక్కు సివిల్ కోర్టులోనే తేలుతుందని తెలిపింది. ఆలయ భూముల వివాదాలను ఎండోమెంట్ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు భూ వివాదాలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.