మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలంలో రోడ్డు విస్తరణ పనుల కారణంగా మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. పట్టణ కేంద్రంతో పాటు సుమారు 33 గ్రామాలకు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మంగళవారం ఉదయం వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా భూగర్భ పైపులైన్లను మార్చాల్సి ఉండటమే ఇందుకు కారణం. పల్లెర్ల, రెనివట్ల, కాజీపూర్ వంటి గ్రామాలతో పాటు పలు తండాల ప్రజలు ఈ నాలుగు రోజులు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.