జీవో నంబర్ 97ను వ్యతిరేకిస్తూ ఆగస్టు 25న రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. పాలిటెక్నిక్లను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆందోళన ఉందని ఏబీవీపీ తెలిపింది. ఈసెట్ లేటరల్ ఎంట్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పాఠ్య ప్రణాళిక, ప్రవేశాలు, సర్టిఫికెట్లు, ఉద్యోగ అవకాశాలపై స్పష్టత కావాలని డిమాండ్ చేసింది. ఈ బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది.