రేపే అకౌంట్లలోకి డబ్బులు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. వారందరికీ బిగ్ రిలీఫ్..

6 months ago 10
వరద బాధితులకు బిగ్ రిలీఫ్.. సాంకేతిక కారణాలతో వరద సాయం అందని వారికి ఏపీ ప్రభుత్వం సోమవారం వరద పరిహారం బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. ఇప్పటి వరకూ 98 శాతం మందికి వరద పరిహారం అందింది. అయితే బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం సహా ఇతరత్రా కారణాలతో సుమారుగా 21 వేలమందికి పరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో వారందరికీ మిగిలిన రూ.18 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. స్థానిక జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
Read Entire Article