Retired Ias A Sharath Appointed As Ttd Jeo: టీటీడీకి కొత్త జేఈవోగా తెలంగాణ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ శరత్ నియమితులయ్యారు. ఏడాదిగా ఖాళీగా ఉన్న విద్య, ఆరోగ్య విభాగాల బాధ్యతలు ఆయనకు అప్పగించారు. సీఎం చంద్రబాబుతో సన్నిహిత పరిచయాలు, కుప్పంలో పనిచేసిన అనుభవం ఈ నియామకానికి కారణమని తెలుస్తోంది. తెలంగాణ కేడర్లో రిటైర్ అయిన అధికారిని టీటీడీలో కీలకమైన జేఈవోగా నియమించడం ఆసక్తికరంగా మారింది.