మూసీ సుందరీకరణలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు రూ.25 వేల నగదు కూడా ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న వారి కోసం ఏకంగా 16 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారిని ఆ డబుల్ బెడ్రూం ఇళ్లలోకి తరలించేందుకు.. ప్రత్యేకంగా టీమ్లను కూడా ఏర్పాటు చేసింది.