Revanth Reddy Govt New Scheme: తెలంగాణలో మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన భట్టి విక్రమార్క.. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇంధన శాఖలో విధులు నిర్వహిస్తోన్న ఉద్యోగుల పిల్లల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు. మరోవైపు.. రైతుల దగ్గరి నుంచి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసేలా.. వ్యవసాయ మోటార్లకు సోలార్ పంపు సెట్లు పంపిణీ చేయబోతున్నట్టు ప్రకటించారు.