జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే.. మరో గేమ్ ఛేంజర్ ఇన్వెస్ట్మెంట్ను రాబట్టింది. ఎన్టీటీ డేటా, నెయిసా నెట్వర్క్స్ కలిసి హైదరాబాద్లో రూ. 10,500 కోట్లతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.