తెలంగాణలో అర్హత ఉండి కూడా కొత్త రేషన్ కార్డులు రాని వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. అర్హులైన వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.