తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులకు అలర్ట్. జనవరి నుంచి సన్నబియ్యం కోటా పొందాలంటే.. కార్డులోని సభ్యులందరూ ఈ నెలాఖరులోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి. గడువులోపు వేలిముద్రలు వేయని వారికి రేషన్ నిలిపివేస్తామని.. 5 ఏళ్ల లోపు పిల్లలకు మినహాయింపునిచ్చామని అధికారులు తెలిపారు.