పేదలకు తక్కువ ధరకు నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసింది. రేషన్ దుకాణాల ద్వారా రాయితీ ధరలపై నిత్యావసర సరుకులు అందిస్తోంది. అయితే ఏపీలో గత కొంతకాలంగా రేషన్ కార్డుదారులకు కందిపప్పు సరఫరా జరగడం లేదు. గోధుమపిండి, జొన్నలు, రాగులు, బియ్యం, చక్కెర అందిస్తున్న ప్రభుత్వం.. కందిపప్పును మాత్రం అందుబాటులో ఉంచలేదు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు చుక్కలను అంటుతున్న నేపథ్యంలో కందిపప్పు కూడా అందించాలని ప్రజలు కోరుతున్నారు.