తెలంగాణ రేషన్ కార్డుదారులకు త్వరలో పూర్తిస్థాయిలో నిత్యవసర సరుకులు అందజేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు కూడా ఇవ్వనున్నట్టు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. మరోవైపు.. SLBC లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, సమస్యలు త్వరలో పరిష్కరించనున్నట్టు తెలిపారు. ఇదే క్రమంలో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టులు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.