రేషన్ కార్డుదారులు రేషన్ బియ్యం కోసం రేషన్ షాపుల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేదు. క్యూలైన్లలో ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా.. ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ వాడుతోంది. ఇందులో భాగంగా కొత్త ఈ పోస్ యంత్రాలను రేషన్ డీలర్లకు అందించారు. వైఫై ఆధారంగా పనిచేసే ఈ పోస్ యంత్రాల ద్వారా సిగ్నల్స్ సమస్యకు చెక్ పెట్టింది. గతంలో సెల్ సిగ్నల్స్ సాయంతో ఈ పోస్ యంత్రాలు పనిచేసేవి. సిగ్నల్స్ అందకపోవటంతో రేషన్ సరుకుల పంపిణీ ఆగిపోయేది. దీంతో లబ్ధిదారులు ఎదురుచూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు వైఫై సాయంతో పనిచేసే యంత్రాలు అందించడంతో సిగ్నల్స్ సమస్యకు చెక్ పడింది.