అక్రమ రేషన్ బియ్యం రవాణాను అరికట్టేందుకు, ప్రభుత్వ పథకాలు నిజమైన పేదలకు చేరేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనర్హుల వద్ద ఉన్న తెల్ల రేషన్ కార్డులను గుర్తించి, వాటిని తొలగించే ప్రక్రియను వేగవంతం చేసింది. క్షేత్రస్థాయి విచారణ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని, అర్హులకు అన్యాయం జరగదని అధికారులు భరోసా ఇస్తున్నారు.