రైతు భరోసా పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా..? అని తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో మంత్రి తుమ్మల కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ పథకం అమలు కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సబ్ కమిటీ విధివిధానాలు ఖరారు చేయగానే.. వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. గతంలో మాదిరి కాకుండా కేవలం పంట సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.