రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. అకౌంట్లోకి నిధుల జమ ఎప్పుడంటే..?

1 month ago 14
తెలంగాణలో యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. సాగులో ఉన్న భూములను పక్కాగా గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన శాటిలైట్ సర్వే కారణంగా ఈ జాప్యం జరుగుతోంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వే నివేదిక అందాక.. కేవలం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేయనున్నారు. సాగు చేయని భూములకు ఈసారి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత కోసమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Read Entire Article