అనంతపురం రైతులు వక్క సాగుతో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు. ఒక్కసారి నాటితే వందేళ్ల పాటు దిగుబడినిచ్చే ఈ పంటతో ఎకరాకు రూ.4 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తూ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో 5 వేల ఎకరాల్లో వక్క సాగు చేస్తున్నారు. చల్లని వాతావరణ ఈ పంట సాగుకు అనుకూలం అంటున్నారు రైతులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..