Farmers Get Income With Papaya Milk: కర్నూలు జిల్లా రైతులు బొప్పాయి సాగుతో పాటు, పాల సేకరణ ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. తొమ్మిది నెలల తర్వాత పండ్లు, 13 నెలల తర్వాత కాయల నుంచి పాలు సేకరిస్తున్నారు. తెల్లవారుజామున గాట్లు పెట్టి సేకరించే ఈ పాలతో ఎకరాకు రూ.24 వేల వరకు ఆదాయం వస్తోంది. మందులు, కాస్మోటిక్స్ తయారీలో వాడే ఈ పాలను బెంగళూరు, చెన్నైతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.