తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబర్ మొదటి వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. సన్న ధాన్యం పండించే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వనున్నారు. ఈసారి కొనుగోలు కేంద్రాల సంఖ్యను కూడా పెంచారు.