Ap Farmers Money Deposited Within 24 Hours: ఖరీఫ్ సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 33 వేల మంది రైతుల నుంచి 2.36 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 24 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గతేడాది కంటే 30% ఎక్కువ సేకరణ జరిగిందని, రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.