ఏపీ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసింది. నామమాత్రం రుసుముతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్గదర్శకాల ప్రకారం అన్ని ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ కోసం రావాలని సూచిస్తున్నారు.