తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. లక్ష్యాలను చేరుకోని కంపెనీలపై వేటు వేయాలని, అవసరమైతే ప్రభుత్వ రంగ సంస్థల జోన్లను కూడా రద్దు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హెచ్చరించారు. రైతులకు రాయితీలు, ప్రాసెసింగ్ యూనిట్ల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.