Kuppam Farmers Vegetable Seeds Low Prices: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన రైతుల కోసం కుప్పంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఆధునిక సాంకేతికతతో, తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయల నారును అందిస్తున్నారు. ఇండో-ఇజ్రాయెల్ పద్ధతుల్లో అంటుకట్టిన నారుతో పాటు, శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. రైతులకు తక్కువ ధరకే ఈ నారును అందిస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని సూచిస్తున్నారు.