Ap Govt Farmers Crop Insurance: ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులకు అండగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) అమలులో ఉంది. తక్కువ ప్రీమియంతో అధిక బీమా ప్రయోజనం పొందవచ్చు. వరి, మామిడి వంటి పంటలకు ఈ నెల 31లోపు ప్రీమియం చెల్లించాలి. ఈ మేరకు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువులోపు ప్రీమియం చెల్లించకపోతే బీమా వర్తించదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.