Andhra Pradesh Rythu Bandhu Scheme 2025: రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. దీనితో పంటకు సరైన ధర లేనప్పుడు, రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డు గోదాముల్లో ఆరు నెలల పాటు ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు. అంతేకాదు, పంట విలువలో 75% వరకు రుణం కూడా పొందవచ్చు. సకాలంలో చెల్లిస్తే వడ్డీ భారం ఉండదు. ఈ పథకం రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది.