తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతుభరోసా పథకం అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 54.74 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4666 కోట్లకు పైగా నిధులు జమ చేసారు. నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఈ నెలాఖరులోపు నిధులు జమ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి 25 నుంచి మూడు నుంచి నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.