తెలంగాణలో రైతుల సౌకర్యార్థం మరిన్ని గోదాములు, శీతల గిడ్డంగులు నిర్మిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉత్పత్తుల భద్రతకు మార్కెట్ యార్డులు, రైతుబజార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పత్తి, పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేశామని, జొన్నల సేకరణలో లోపాలకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సహకార సంఘాల్లో ఆడిటింగ్, అక్రమార్కుల నుంచి నిధుల రికవరీకి ఆదేశించారు. దీర్ఘకాలం పనిచేస్తున్న పీఏసీఎస్ సీఈవోల బదిలీకి ఆదేశించారు.