ఏపీ రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రైతులకు అనవసరమైన ఎరువులను అంటగట్టేందుకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీలర్లను హెచ్చరించారు. ఎంఆర్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.