తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై ఏర్పడిన ప్రతిష్టంభన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చర్చలతో తొలగిపోయింది. సీసీఐ, జిన్నింగ్ మిల్లుల వివాదం కారణంగా నిలిచిపోయిన కొనుగోళ్లు నవంబర్ 19 నుంచి తిరిగి ప్రారంభమవుతాయి. కఠిన నిబంధనలు, ఎకరానికి 7 క్వింటాళ్ల కొనుగోలు షరతులపై మిల్లర్లు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 45.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. 27 లక్షల టన్నుల దిగుబడి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. మంత్రి హామీతో రైతులకు కనీస మద్దతు ధర దక్కనుంది.