టెక్నాలజీ అనేది ప్రతీ రంగంలోకి దూసుకెళ్లింది. దానిని ప్రస్తుత అవసరాలకు వినియోగిస్తే ఫలితాలు అమోఘంగా ఉంటాయి. వ్యవసాయ రంగంలో కూడా నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని అనేక పరికరాలు తయారు చేశారు. వాటిని కొనేందుకు రైతుల వద్ద అంత డబ్బు ఉండకపోవచ్చు.. అలాంటి వారి కోసమే ప్రభుత్వం కొన్ని పరికరాలను సబ్సిడీ కింద అందజేస్తోంది. 50 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది. స్థానిక ఏఈఓల వద్ద రైతులు అవసరమైన పత్రాల జిరాక్స్లను జతచేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.