రైతులకు మరో శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. ఇక నుంచి నేరుగా ఇంటి నుంచే..

6 months ago 21
తెలంగాణ రబీ సీజన్ ప్రణాళికపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. యూరియా పంపిణీలో పారదర్శకత కోసం కొత్త మొబైల్ యాప్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఈ యాప్‌ ద్వారా రైతులు స్టాక్ లభ్యత తెలుసుకుని, బుకింగ్ ఐడీ ద్వారా యూరియా పొందవచ్చు. కౌలు రైతులకు కూడా ఆధార్ ధృవీకరణతో బుకింగ్ సౌకర్యం కల్పిస్తారు. యూరియా అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలని.. పంట అవశేషాలను కాల్చకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. యాప్ లక్ష్యం, నిజమైన రైతులకు మాత్రమే యూరియా అందడం.
Read Entire Article