తెలంగాణలో రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 4 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు పంట పెట్టుబడి సాయం అందింది. ఇప్పుడు 4 ఎకరాలకుపైన భూమి కలిగిన రైతులకు కూడా పూర్తిస్థాయిలో పెట్టుబడి సాయం విడుదల చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నిధుల సర్దుబాటు పూర్తైన వెంటనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసి రైతుల ఖాతాల్లో సాయం జమ చేసే అవకాశం ఉంది.