తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కరెంట్ సమస్యల పరిష్కారం కోసం ఇకపై గంటల తరబడి వెయిట్ చేయక్కర్లేదు. 108 అంబులెన్స్ లాగే, ఇప్పుడు విద్యుత్ అంబులెన్స్లు అందుబాటులోకి వచ్చాయి. 1912 కి కాల్ చేస్తే చాలు, మొబైల్ ట్రాన్స్ఫార్మర్లతో కూడిన వాహనం వచ్చి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. అలానే 2024, 2025 రెండు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల అదనపు కనెక్షన్లు మంజూరు చేశామన్నారు.