Guava Nursery Business: ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల్లోని రైతులు అర ఎకరం స్థలంలోనే జామ మొక్కలను పెంచుతూ ఏటా రూ.20 కోట్ల వరకు ఆర్జిస్తున్నారు. ఒక్కో మొక్కను రూ.30కు అమ్ముతూ భారీ లాభాలు గడిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఏటా 2 కోట్ల జామ మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్న ఈ వ్యాపారం ఎంతో ఆశాజనకంగా ఉంది అంటున్నారు రైతులు. ఇతర రాష్ట్రాలకు ఒక్కో మొక్కను రూ.30కి విక్రయిస్తున్నారు.