AP Passbooks Distribution: కొత్త సంవత్సరంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 2 నుంచి కొత్త పాసు పుస్తకాల పంపిణీ మొదలు కానుంది. 21.80 లక్షల పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. గ్రామ సభల్లోనే వీటిని అందజేస్తారు. తప్పులుంటే రైతులు ఇబ్బంది పడవద్దని.. అధికారులే ఇంటికి వచ్చి సరిచేస్తారని, భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రెవెన్యూ క్లినిక్ల ద్వారా వేగంగా భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.