Railway Officials Stopped Vande Bharat Train At Duvvad: మొంథా తుఫానుతో రైళ్లన్నీ రద్దు అవ్వడంతో, దువ్వాడలో స్టాప్ లేకపోయినా వందేభారత్ రైలును ఆపారు. ప్రయాణికుల ట్వీట్, రైల్వే వినియోగదారుల సంఘం ప్రతినిధి విజ్ఞప్తితో అధికారులు స్పందించి, తాత్కాలికంగా దువ్వాడలో హాల్టు కల్పించారు. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం వెళ్లి తిరిగి రావడానికి ఇబ్బంది పడతారని భావించిన ప్రయాణికుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది డివిజన్లో ఇలాంటి తొలి సంఘటన.