ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుంది. విజయవాడ శివారు ప్రాంతంలోని రాయనపాడు రైల్వేస్టేషన్ జూలై 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. జూలై 17న రైల్వేస్టేషన్ ప్రారంభించేందుకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్పై రద్దీ పడుతున్న నేపథ్యంలో.. ఆ ప్రభావం తగ్గించేందుకు రాయనపాడును శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేశారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రూ.35 కోట్లతో ఆధునికీకరణ చేపట్టారు.