రైలు ప్రయాణంలో ఏర్పడిన పరిచయం కారణంగా కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక దారుణానికి గురైంది. స్వగ్రామానికి వెళ్తున్న బాలికకు మాయమాటలు చెప్పి.. ఫోన్ నెంబర్ తీసుకున్న నిందితుడు ఆమెను లోబరుచుకున్నాడు. ఆ తర్వాత కేపీహెచ్బీ కాలనీలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వేధింపులు భరించలేక.. బాలిక తన పిన్ని ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.