సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చేందుకు కేంద్రం భారీ ఎత్తున నిధులు కేటాయించింది. ప్రస్తుతం స్టేషన్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ పనుల నిమిత్తం.. పలు రైళ్లను దారి మళ్లించారు. ఇప్పుడీ అభివృద్ధి పనులు చివరకు దశకు చేరుకున్నాయని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ అవుతాయని అధికారులు తెలిపారు. కొన్ని రైళ్లు మాత్రం చర్లపల్లి నుంచే నడుస్తాయని సమాచారం.