దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తాంబరం - సంత్రాగచ్చి మధ్య వారానికి ఒకసారి నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ జనవరి 23 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ రైలు ఏపీలోని పలు స్టేషన్లలో ఆగనుందని రైల్వే శాఖ పేర్కొంది. సుదూర ప్రాంతాల మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం ఈ అమృత్ భారత్ రైలును ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీసు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుందని చెప్పింది.