Railway Solar Power Project Stations: ఖర్చు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునే దిశగా రైల్వే శాఖ వినూత్న అడుగులేస్తోంది. రైలు పట్టాల మధ్య సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి, తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. వారణాసిలో విజయవంతమైన ఈ ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని రైల్వే బోర్డు ఆదేశించింది. భూసేకరణ భారం లేకుండానే సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు ఈ ప్రణాళిక దోహదపడుతుంది. దీని ద్వారా ఏటా 24 వేల కోట్ల రూపాయల ఖర్చును తగ్గించుకోవచ్చని భావిస్తోంది.