తెలంగాణకు చెందిన మాజీ, సిట్టింగ్ మంత్రులు కస్టమ్స్ మోసంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరానికి చెందిన కార్ల వ్యాపారవేత్త లగ్జరీ కార్లను తక్కువ ధరకు అమ్మినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు ఈ కార్ల కొనుగోలు వెనుక ఉన్న మతలబు ఏమిటి? రాజకీయ నాయకులకు, ఈ మోసానికి సంబంధం ఏమిటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది.