వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి. లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా భూముల సర్వే చేయించి, నిర్దిష్ట ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పారదర్శకంగా.. వేగంగా పూర్తి చేస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.