డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తన వద్దకు వచ్చిన వారి సమస్యలు తీర్చుతానని హామీ ఇచ్చారు. ఉప్పాడలో కాలుష్యంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని విన్నవించగా.. ఈ సమస్యను వంద రోజుల్లోగా పరిష్కరిస్తానని వారికి అండగా నిలిచారు. ఉప్పాడ కాలుష్యంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులను డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు.