గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు గత కొన్ని రోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ఆ రైలు ఎక్కాలంటేనే ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఆ మార్గంలో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను పంపించేందుకు.. గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలును అధికారులు గంటల తరబడి ఆపేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే సరిపడా ట్రాక్లు ఉన్నా.. గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలును ఆపుతున్నారని.. ప్రయాణికులు మండిపడుతున్నారు.