తెలంగాణ ఉన్నత పాఠశాలల్లో క్రీడా శిక్షణను మెరుగుపరచడానికి.. పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలోని 4,701 హైస్కూళ్లలో 1,803 మంది పీఈటీలు లేరు. ఈ కొరతను తీర్చడానికి, ప్రాథమిక పాఠశాలల్లోని కొన్ని ఎస్జీటీ పోస్టులను తగ్గించి, కొత్తగాపీఈటీ స్థానాలను మంజూరు చేయాలని అధికారులు కోరారు. అలాగే.. 260 హెచ్ఎం పోస్టులను కూడా ఇదే విధంగా సర్దుబాటు చేయాలని ప్రతిపాదించారు. నిరుద్యోగులు రాబోయే డీఎస్సీలో లైబ్రేరియన్ పోస్టులు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.