తెలంగాణను వానలు వీడటం లేదు. ప్రతి రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక రాజధాని భాగ్యనగరం సంగతి అయితే మరీ దారుణం. ఉదయం అంతా పొడి వాతావరణం, ఎండ తీవ్రంగా ఉంటుండగా.. సాయంత్రానికి ఉన్నట్టుండి భారీ వర్షం కురుస్తోంది. అక్టోబర్ నెలతో వర్షాల నుంచి ఉపశమనం దొరుకుతుందని భావించిన ప్రజలకు నిరాశే ఎదురవుతుంది. శనివారం నాడు బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడనుంది. మరి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే...