దేశంలో ఆయిల్పామ్ అత్యంత లాభదాయకమైన పంటగా కేంద్ర అధ్యయనంలో తేలింది. వరి, పత్తి కంటే అధిక ఆదాయాన్నిచ్చే ఈ పంటతో 2047 నాటికి పామాయిల్లో స్వయం సమృద్ధి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో ఆయిల్పామ్ సాగును పది లక్షల ఎకరాలకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.