తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు ఈ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయాయి. ఇక కామారెడ్డి పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజలను కాపాడేందుకు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇదిలా ఉంటే వాతావరణ శాఖ తెలంగాణకు కీలక అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆ వివరాలు..