మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వానాకాలంలో హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైడ్రా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జలవిహార్లో ఏర్పాటు చేసిన మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ల ప్రత్యేక సమావేశంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో హైదరాబాద్లో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.